Developmental News

...for change makers

20071027

ఐడెంటిటీ కార్డ్ ఉంటేనే రిజర్వేషన్ తో ప్రయాణం

రైల్లో రాయితీపై ప్రయాణించే సీనియర్ సిటిజన్లు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లడం తెలిసిందే.అలాగే ఇకపై రిజర్వేషన్ చేయించుకొని ప్రయాణించే వారంతా తమ ఐడెంటిటీ నిరూపించే కార్డు లేదా ఇతర ఆధారాన్ని, చిరుమానా ధ్రువీ కరణను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలంటూ ఉత్తర రైల్వే ప్రయాణికులందరికీ సూచించింది. ఒకవేళ అవి లేకుంటే, ప్రయాణికుడు వేరొకరి టికెట్‌పై ప్రయాణిస్తున్నట్లు పరిగణించి రైల్వే చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. మరొకరి పేరు మీదున్న టికెట్‌తో ప్రయాణిస్తే రూ.500 జరి మానా, మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశ ముంటుందని హెచ్చరించింది. అనధీకృత ట్రావెల్ ఏజెంట్ల మోసాలు, రద్దీ సమయాల్లో భారీగా టికెట్లు బుక్ చేసి, బ్లాక్‌లో విక్రయించే వారి ఆగడాలకు అడ్డు కట్ట వేసేందుకే ఈ ఐడెంటిటీ కార్డుల నిబంధనను పెడుతున్నట్లు తెలిపింది.

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home