Developmental News

...for change makers

20071126

విమానం రద్దుకు పరిహారం చెల్లించాలి

నిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా రైళ్ళు, బస్సులు, విమానాలు బయ లుదేరడం, ముందస్తు సమాచారం లేకుండానే హఠాత్తుగా రద్దవడం, ఇవన్నీ తరచుగా ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలే. ఎప్పుడు బయలు దేరుతుందో తెలియక, అసలు సర్వీసు ఉందో, రద్ద యిందో సమాచారంలేక గంటల తరబడి ఎదురుచూస్తూ ప్రయాణికులకు  కలిగే చికాకు, ఆందోళన, ఆవేదన అంతా ఇంతా కాదు. ఇలా బాధ్యతా రా హిత్యంగా ప్రవర్తిస్తున్న రవాణా సంస్థలపై వినియోగదారుల కోర్టులలో ఎన్నోసార్లు కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు కూడా ఇటువంటిదే. సాంకేతిక కారణాల రీత్యా విమానాలను రద్దుచేసిన విమానయాన సంస్థలు ప్రయాణికులందరికీ 15,000 రూపాలయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. యోగేష్ కుమార్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదును విచారించిన కమిషన్ ఈ ఆదేశాలు జారీచేసింది.

Labels:

0 Comments:

Post a Comment

<< Home