20080212

వంటనూనె తయారీ యూనిట్లపై దాడి

వంటనూనె తయారీ యూనిట్లపై తూనికలు, కొలతల అధికారులు దాడులు చేసి 58 మిల్లులపై కేసులు నమోదు చేశారు. తక్కువ మోతాదులో అయిల్‌ను ప్యాకింగ్‌ చేస్తున్న యూనిట్లపై హైదరాబాద్‌, రంగారెడ్డిలకు చెందిన అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని గగన్‌పహాడ్‌, కాటేదాన్‌, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ఉన్న గోవర్దన్‌, మనియర్‌, అనీల్‌, అరుణ, గుడ్‌ హెల్త్‌ ఆగ్రోటెక్‌, షాలిమర్‌ డ్రాప్‌, ధూల్‌చంద్‌, పవన్‌, షాలిమర్‌, సర్దా, శీతల్‌, రామచరణ్‌ రిఫైనరీ అయిల్‌ యూనిట్లపై కేసులు నమోదు చేశామని లీగల్‌మెట్రాలజీ కంట్రోలర్‌ తెలిపారు.

0 Comments:

Post a Comment

<< Home