20071105

ఎటిఎంలు ఇకపై రైళ్లలో

ఎటిఎంలు రైళ్లలో కూడా ఏర్పాటుకాబోతున్నాయి. ఖాతా దారులు రైళ్లల్లో ఏర్పాటు చేయబోతున్న ఎటిఎంల నుంచి డబ్బు డ్రా చేసు కునే సౌలభ్యం పొందబోతున్నారు. ఎం పిక చేసిన రైళ్లల్లో ఎటిఎంలను నెలకొ ల్పడానికి రైల్వేలు ప్రణాళికలు రూపొం దిస్తున్నాయి. పైలెట్‌ ప్రాజెక్టు కింద కొన్ని రైళ్లల్లో ఎటిఎంలను ఏర్పాటు చేయడా నికి సన్నాహాలు చేస్తున్నారు.

Labels: , ,

20071027

ఐడెంటిటీ కార్డ్ ఉంటేనే రిజర్వేషన్ తో ప్రయాణం

రైల్లో రాయితీపై ప్రయాణించే సీనియర్ సిటిజన్లు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లడం తెలిసిందే.అలాగే ఇకపై రిజర్వేషన్ చేయించుకొని ప్రయాణించే వారంతా తమ ఐడెంటిటీ నిరూపించే కార్డు లేదా ఇతర ఆధారాన్ని, చిరుమానా ధ్రువీ కరణను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలంటూ ఉత్తర రైల్వే ప్రయాణికులందరికీ సూచించింది. ఒకవేళ అవి లేకుంటే, ప్రయాణికుడు వేరొకరి టికెట్‌పై ప్రయాణిస్తున్నట్లు పరిగణించి రైల్వే చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. మరొకరి పేరు మీదున్న టికెట్‌తో ప్రయాణిస్తే రూ.500 జరి మానా, మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశ ముంటుందని హెచ్చరించింది. అనధీకృత ట్రావెల్ ఏజెంట్ల మోసాలు, రద్దీ సమయాల్లో భారీగా టికెట్లు బుక్ చేసి, బ్లాక్‌లో విక్రయించే వారి ఆగడాలకు అడ్డు కట్ట వేసేందుకే ఈ ఐడెంటిటీ కార్డుల నిబంధనను పెడుతున్నట్లు తెలిపింది.

Labels: ,

20071025

రైళ్లలో సీసీ కెమెరాలు

ముంబయి రైల్వే అధికారులు సబర్బన్ రైళ్లలోని మహిళల బోగీల్లో క్లోజ్‌డ్ సర్క్యూట్ (సీసీ) కెమెరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ రైల్వే పరిధిలో ప్రథమ శ్రేణి మహిళా బోగీల్లో ఆరు సి.సి. కెమెరాలను బిగించారు. ఆడ పిల్లలను వేధించే వారిపై, జేబులు కత్తిరించే వారిపై, ఇతరత్రా అల్లర్లకు పాల్పడే వారిపై కన్నేసి ఉంచేందుకు వీటిని బిగించారు. ఇవి సత్ఫలితాలిస్తే మిగతా రైళ్లలో కూడా ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తీవ్రవాదుల దాడులకు సబర్బన్ రైళ్లు ఎంత అనుకూలమో గత ఏడాది జులై 11వ తేదీన జరిగిన బాంబు పేలుళ్లు వెల్లడించాయి. దీంతో రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. చర్చి గేటు, విరార్ మధ్య ఉన్న రైల్వే స్టేషన్లన్నిటిలో సి.సి. టి.వి.లు ఏర్పాటు చేయడానికి పశ్చిమ రైల్వే అంగీకరించింది. ఇప్పటి వరకు 66 సి.సి. టి.వి.లను నెలకొల్పింది. ఇప్పుడు రైళ్ల లోపల వీటిని నెలకొల్పడం వల్ల ప్రయాణికులు, ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల విశ్వాసం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రైలు ప్రవేశ ద్వారంతో పాటు కూర్చున్న, నిలబడిన మహిళలందరినీ సి.సి. టి.వి.లు కవర్ చేస్తాయి. సెక్యూరిటీతో పాటు మహిళల మెడల్లో గొలుసులు లాక్కెళ్లడం, జేబులు కత్తిరించడం లాంటి సంఘటనలపై కూడా కన్నేసి ఉంచడానికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 15 రోజుల్లో జరిగిన సంఘటనల వివరాలన్నీ ఈ కెమెరాలు అందచేస్తాయి.

Labels: ,

139 నెంబరుతో కాల్‌సెంటర్ రైల్వే సమాచారం

రైల్వేకు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం దక్షిణాది రాష్ట్రాలన్నిటి కోసం 139 నెంబరుతో కాల్‌సెంటర్‌ను రైల్వే ప్రారంభించింది. తమిళనాడు నుంచి ఈ కేంద్రం పనిచేస్తున్నా, నాలుగు రాష్ట్రాల పరిధిలో ఎక్కడి ప్రజలైనా కేవలం ఒక లోకల్‌కాల్‌తో తమకు కావాల్సిన సమాచారాన్ని రోజులో ఏ సమయంలోనైనా పొందే వీలుంది. అంటే 24X7 విధానంలో ఇది పనిచేస్తుంది. 'ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం' (ఐ.వి.ఆర్.ఎస్.)లోనే కాకుండా అవసరమైతే సిబ్బంది ద్వారా కూడా సమాధానాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రయాణికులు చేయాల్సిందల్లా ఏంటంటే కంప్యూటర్లో వినిపించే సులభమైన సూచనలను పాటిస్తూ పోవడమే. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, ఇంగ్లిష్, హిందీ భాషల్లో విస్తారమైన సమాచారాన్ని ఈ కాల్ సెంటర్ అందిస్తుంది. సాధారణంగా రైళ్ల రాకపోకల వేళలు, బెర్తుల లభ్యత, పి.ఎన్.ఆర్. నెంబరు ఆధారంగా టికెట్ల తాజా స్థితి వంటివి తెలుసుకునేందుకు ఎక్కువమంది రైల్వే ఎంక్వయిరీకి ఫోన్ చేస్తుంటారు. 139లో ఇలాంటి వివరాలను ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా చిటికెలో ఇవ్వడమే కాకుండా వేరే స్టేషన్లకు సంబంధించిన సమాచారాన్ని సిబ్బంది ద్వారా తెలియపరుస్తారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి పుణె వెళ్లే రైళ్ల గురించి విశాఖలోని ప్రయాణికుడు తెలుసుకోవాలంటే 139 నెంబరుతో సాధ్యమే. నాగ్‌పూర్ స్టేషన్లో ఏసీ డార్మిటరీ వసతి ఉందో లేదో రాజమండ్రి ప్రయాణికుడు ఇట్టే తెలుసుకోవచ్చు. ఆయా స్టేషన్లలో ఉండే వసతి సదుపాయాలు, ప్రయాణికులకు అందుబాటులో ఉండే వసతులు, వివిధ రాయితీలు, సర్క్యులర్ టికెట్లు... ఇలా రైళ్లకు సంబంధించిన ఏ సమాచారం కావాలంటే దానిని అందించేందుకు వీలుగా 'కస్టమర్ కేర్ కాల్ సెంటర్'ను తీర్చిదిద్దారు.

Labels: ,